by సూర్య | Sat, Oct 12, 2019, 03:31 PM
జమ్మూ కాశ్మీర్ లో పోస్టు పెయిడ్ మొబైల్ ఫోన్ సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సేవలను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రావల్సి ఉండగా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల సాధ్యం కాలేదు. అక్టోబర్ 14న మధ్యాహ్నం 12గంటల నుంచి అన్ని పోస్టు పెయిడ్ మొబైల్ ఫోన్ సేవలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు.
Latest News