by సూర్య | Sat, Oct 12, 2019, 02:14 PM
ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ స్థిరాస్తి వ్యాపారి ఇంటిపై దాడి చేసిన సంఘటనలో అతనిపై నేర నిరూపణ జరిగిందని శుక్రవారం స్టానిక కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు విధించనున్న శిక్షపై ఈ నెల 18న తీర్పును వెలువరించనుంది. 2015 ఫిబ్రవరి 6న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు రాం నివాస్ గోయల్ తన అనుచరులతో కలిసి వెళ్లి వివేక్ విహార్లోని స్థిరాస్తి వ్యాపారి మనీశ్ ఘయ్ ఇంటిపై దాడి చేసి, అక్కడి వారిని గాయపరిచినట్టు కేసు నమోదయింది.
Latest News