by సూర్య | Sat, Oct 12, 2019, 02:45 PM
గత ఎన్నికల్లో కేంద్రంతో విబేధించడం వల్లనే ఓటమి పాలయ్యామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల్ని నమ్ముకొని ముందుకు వెళ్లామని కానీ ప్రయోజనం పొందిన వారు సహకరించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విబేధించామని, కానీ దాని వల్ల లాభం జరగలేదన్నారు. ఒకవేళ ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించకుంటే ఈ రోజు పరిస్థితి వేరే తీరుగా ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక పై భవిష్యత్ లో ఎటువంటి తప్పు లేకుండా ముందుకు వెళ్లాలని, అంతా సమన్వయంతో నడుచుకోవాలని చంద్రబాబు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాంటిదని ఎద్దేవా చేశారు.
Latest News