by సూర్య | Sat, Oct 12, 2019, 10:45 AM
రాష్ట్రంలో వరద భీభత్సాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, పరిమితులు దాటి వరద సహాయక చర్యలు చేపట్టామని కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప అన్నారు. శాసనసభలో వరద పరిస్థితిపై జరిగిన చర్చకు యెడియూరప్ప సమాధానమిస్తూ బాధితులకు అందజేసిన ఆర్థిక సహాయం, ఇతర సహాయక చర్యలను వివరించారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వరద సహాయం కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.
Latest News