by సూర్య | Sat, Oct 12, 2019, 11:16 AM
విశాఖపట్నం : లక్షదీవుల నుంచి కొమరిన్, తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితలద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం వరకు నర్సీపట్నంలో ఆరు, పలాస, తాళ్లరేవు, ఎర్రగొండపాలెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
Latest News