by సూర్య | Fri, Oct 11, 2019, 08:05 PM
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యున్నత పురస్కారం లభించింది. ఆఫ్రికాలో పర్యటిస్తున్న ఆయనకు అక్కడి ప్రభుత్వం కొమొరస్ అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం వెంకయ్యనాయుడుకు కొమొరస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల తరపున అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్- కొమొరస్ మైత్రికి గుర్తుగా ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Latest News