by సూర్య | Fri, Oct 11, 2019, 06:34 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో ప్రధాని మహాబలిపురానికి చేరుకున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. మోదీ, జిన్పింగ్ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్పింగ్కు ప్రధాని మోదీ వివరిస్తున్నారు.
Latest News