డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డ విరాట్ కోహ్లీ

by సూర్య | Fri, Oct 11, 2019, 03:11 PM

పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊచకోత కోశాడు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ స్టేడియం నలువైపులా చూడముచ్చటైన షాట్లను కొడుతూ, తన టెస్ట్ కెరీర్ లో ఏడవ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 295 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో 28 బౌండరీలను కోహ్లీ బాదాడు. 200 పరుగులు చేసినా ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో తన టెస్ట్ కెరీర్ లో కోహ్లీ 7వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో కోహ్లీకి అండగా రవీంద్ర జడేజా 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 483 పరుగులు. అంతకు ముందు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు తీయగా, మహరాజ్ ఒక్క వికెట్ తీశాడు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM