by సూర్య | Fri, Oct 11, 2019, 03:08 PM
నాయుడుపేట గంజాయి స్వాధీనం చేసుకున్నపోలీసులు. శుక్రవారం నెల్లూరు లో చోటు చేసుకుంది. గూడురు డిఎస్పి బి.భవాని హర్ష మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇచ్చిన ఆదేశాల మేరకు.. నాయుడుపేట లో అక్రమంగా తరలిస్తున్న 95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నలుగురు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట లోని నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు, సిఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు, వారి సిబ్బందిని డిఎస్పి భవాని హర్ష అభినందించారు.
Latest News