by సూర్య | Fri, Oct 11, 2019, 02:42 PM
ఘజియాబాద్లోని హిందాన్ విమానాశ్రయంలో నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడి నుంచి తొలి విమాన సర్వీసు ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నది. హెరిటేజ్ ఏవియేషన్ కంపెనీ సిఇఒ రోహిత్ మాథూర్ మాట్లాడుతూ తొలి సర్వీసును పితోరాగఢ్కు ప్రారంభిస్తున్నామని అన్నారు. డెహ్రాడూన్, హుబ్లి, షివ్లూ తదతర ఇతర ప్రముఖ ప్రదేశాలకు త్వరలోనే విమాన సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.
Latest News