by సూర్య | Fri, Oct 11, 2019, 12:32 PM
బీహార్ రాజధాని పాట్నాలో వరదలపై ఎలాంటి కమిటీని నియమించలేదని ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ చెప్పారు. పాట్నాలో వరదలపై కమిటీ వేశారనే వార్తలపై సుశీల్ కుమార్ స్పందించారు. వరదలపై విచారణ జరిపి దానికి ఎవరినో బాధ్యులను చేయడానికి కమిటీ వేశారనే దానిపై ఆయన స్పందించారు. అటువంటి కమిటీ ఏదీ వేయలేదు అని ఆయన మీడియాకు చెప్పారు.
Latest News