by సూర్య | Fri, Oct 11, 2019, 12:37 PM
పట్నంలో చదువుకుంటానని అక్క ఇంటికి వచ్చింది. ఏకంగా అక్క భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకొని వారి కాపురంలో చెల్లె చిచ్చు పెట్టింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన సంగీత, రంజిత్ భార్య భర్తలు. సంగీత చెల్లెలు పూనం కాలేజిలో చదువుకుంటానంటే గ్వాలియర్ కు రమ్మన్నారు. హాస్టల్ లో కాకుండా తమ ఇంట్లోనే తనకు సహాయంగా ఉండాలని చెల్లెల్ని కోరింది. దీనికి పూనం కూడా అంగీకరించింది. పూనం కాలేజిలో చేరేందుకు రంజిత్ సహాయపడ్డాడు. కాలేజిలో చేర్చాడు. అప్పుడప్పుడు బైక్ పైనే కాలేజికి తీసుకెళ్లేవాడు. ఇలా పూనం, రంజిత్ ల మధ్య బంధం బలపడింది. అక్క మీద బావ చూపే ప్రేమ చూసి తనకు కూడా అలాంటి ప్రేమ దక్కాలనుకుంది. అక్క ఇంట్లో లేని సమయంలో రంజిత్ కు పూనం అన్ని సపర్యలు చేసేది. ఇలా నెమ్మదిగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కాలేజికి అని పూనం, డ్యూటీకి అని రంజిత్ బయటికి వెళ్లేవారు. సంగీత ఇంట్లో లేని సమయంలో వారిద్దరు ఇంట్లోనే రాసలీలలు సాగించేవారు. పూనం, రంజిత్ ప్రవర్తన పై అనుమానం వచ్చిన సంగీత వారి పై కాస్త నిఘా ఉంచింది. గత ఆదివారం పని ఉందని సంగీత బయటికి వెళుతున్నానని చెప్పింది. సెలవు కావడంతో పూనం, రంజిత్ ఇంట్లోనే ఉన్నారు. సంగీత బయటికి వెళ్లగానే పూనం,రంజిత్ తమ రాసలీలల్లో మునిగారు. బయటికి వెళుతున్నట్టు వెళ్లిన సంగీత సడన్ గా అదే సమయంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో వారిద్దరు బెడ్రూంలో కలిసి ఉండడం చూసిన సంగీత షాకైంది. వెంటనే వారిని అదే రూంలో బంధించి ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారమిచ్చింది. అనంతరం సంగీత తన చెల్లెలి పై, భర్త పై దాడి చేసి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News