by సూర్య | Fri, Oct 11, 2019, 12:28 PM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈనెల 12 న జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం ఉదయం 4.20 గంటలకు తిరుమల చేరుకుని గోదావరి సదన్ లో బస చేస్తారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం 5.00 గంటలకు తిరుపతి శ్రీకాశి అన్నపూర్ణ వాసవీ ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు ఆన్నదాన సత్రంలో జరిగే అభినందన సభలో పాల్గొంటారు. ఆదేరోజు రాత్రి 8.00 గంటలకు విజయవాడ తిరుగుప్రయాణం అవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ---- డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి ---
Latest News