by సూర్య | Sun, Aug 25, 2019, 06:06 PM
టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? .భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయనను కలిశారా? .ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చోటు చేసుకుంటున్న చర్చలివి. రాజకీయాల్లోకి పున: ప్రవేశించాలని, తమ పార్టీలో చేరాలని కోరుతూ ఓ జాతీయ పార్టీ తనపైనా ఒత్తిడి తెస్తోందని అంటూ చిరంజీవి ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
తన తాజా చిత్రం సైరా ప్రమోషన్ లో భాగంగా.. ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలపై తాను దృష్టి పెట్టట్లేదని, సినిమాలపైనే ఫోకస్ చేశానని ఆయన అదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అక్కడితో ఈ ఊహాగానాలకు తెరపడి పోయిందని అనుకున్నారంతా. అదే సమయంలో- గంటా శ్రీనివాస్ మెగాస్టార్ తో సమావేశం కావడంతో మరోసారి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ అంశం చర్చల్లోకి వచ్చింది.