by సూర్య | Sun, Aug 25, 2019, 04:49 PM
కేంద్రప్రభుత్వం మిగతా ప్రాజెక్టుల కంటే పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ ఖర్చు చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అక్రమాలపై అధ్యయనం చేయాలన్నారు. నిర్వాసితుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రయత్నం చేస్తామన్నారు. నిర్వాసితులకు రావాల్సింది వచ్చిందా లేదా అనేది ముఖ్యమన్నారు.
Latest News