by సూర్య | Sun, Aug 25, 2019, 03:45 PM
సీఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అంతర్రాష్ట్ర మండలి స్థాయిసంఘం సమావేశంలో పాల్గొంటారు. హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో సమావేశం జరగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమిత్షాతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను, కేంద్రమంత్రుల వద్ద జగన్ ప్రస్తావిస్తారు. అంతేకాదు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్తో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పీపీఏ అభ్యంతరాలపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.
Latest News