by సూర్య | Sun, Aug 25, 2019, 03:27 PM
భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి కుమారుడు రోహన్ నిప్పటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, పలు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు హాజరై జైట్లీకి తుది వీడ్కోలు పలికారు.
Latest News