జైట్లీ అంత్యక్రియలకు హాజరైన రాజకీయ ప్రముఖులు
by సూర్య |
Sun, Aug 25, 2019, 03:09 PM
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ అంతిమయాత్ర నిగంబోధ్ ఘాట్కు చేరుకుంది. మరికాసేపట్లో జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అరుణ్జైట్లీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జైట్లీ అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, వివిధ పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పించారు.
Latest News