by సూర్య | Sun, Aug 25, 2019, 03:09 PM
రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ అభాగ్యుడి పట్ల ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే.. జాలిగుండె లేని సిబ్బంది విరిగిన కాళ్లనే అతనికి తలగడలా పెట్టారు. ప్రదీప్ ఫరీదాబాద్లో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇంటి నుంచి కార్యాలయానికి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే సిబ్బంది కనీస మానవత్వం కూడా చూపలేదు.
Latest News