తూ. గో. జిల్లాలో దారుణ హత్య...

by సూర్య | Sun, Aug 25, 2019, 03:04 PM

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని చప్పిడివారి సావరం దండుగంగమ్మ గుడివీధిలో ఆదివారం తల్లీకూతుళ్లను  గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో కొట్టి దారుణం హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల, డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపిన వివరాల ప్రాకారం.. గ్రామానికి చెందిన బలస మాధవి (45) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నారు. కుమార్తె కరుణ(18) ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. మాధవి భర్త శ్రీనివాస్‌, కుమారుడు విజయ్‌ ఇద్దరూ ఉపాధి నిమిత్తం కాకినాడ విజయశ్రీ హోటల్‌లో పనిచేస్తున్నారు.  వారానికొకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో బలంగా తలపై మోది హత్య చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజగోపాలరెడ్డి, సీఐ శివగణేశ్‌ మృతదేహాలను పరిశీలిస్తున్నారు.


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM