by సూర్య | Sun, Aug 25, 2019, 03:04 PM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని చప్పిడివారి సావరం దండుగంగమ్మ గుడివీధిలో ఆదివారం తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో కొట్టి దారుణం హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల, డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపిన వివరాల ప్రాకారం.. గ్రామానికి చెందిన బలస మాధవి (45) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నారు. కుమార్తె కరుణ(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. మాధవి భర్త శ్రీనివాస్, కుమారుడు విజయ్ ఇద్దరూ ఉపాధి నిమిత్తం కాకినాడ విజయశ్రీ హోటల్లో పనిచేస్తున్నారు. వారానికొకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో బలంగా తలపై మోది హత్య చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజగోపాలరెడ్డి, సీఐ శివగణేశ్ మృతదేహాలను పరిశీలిస్తున్నారు.
Latest News