by సూర్య | Sun, Aug 25, 2019, 02:53 PM
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ పార్థివదేహం నిగంబోధ్ ఘాట్కు చేరుకుంది. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నిగంబోధ్ ఘాట్కు చేరుకుంది. మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, వివిధ పార్టీల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
Latest News