by సూర్య | Wed, Aug 21, 2019, 05:06 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ను కలిసింది. ఈ సందర్బంగా ఏపీలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్లపై మంత్రితో చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని.. అందుకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని.. రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.