by సూర్య | Wed, Aug 21, 2019, 05:00 PM
ఢిల్లీ: వాల్తేరు డివిజన్ను విశాఖ జోన్లో కలపాలని వైసీపీ ఎంపీలు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వచ్చి కలవడం సంతోషంగా ఉందని గోయల్ తెలిపారు. రైల్వే డివిజన్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలపై చర్చించామని ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు గోయల్ వెల్లడించారు. అయితే వాల్తేరు డివిజన్ అంశంపై మాత్రం గోయల్ స్పష్టత ఇవ్వలేదు.
Latest News