by సూర్య | Wed, Aug 21, 2019, 04:55 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో సాధించిన తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నా, జగన్ స్పందించకపోవడం దారుణం. దుగరాజపట్నం ఓడరేవు, బెల్ కంపెనీల గురించి ఆలోచించని ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు అన్నారు.