ఎంజాయ్ చేద్దామని ప్రియురాలిని పిలిచి మత్తులో చిత్తుగా...

by సూర్య | Tue, Aug 20, 2019, 04:02 PM

ఇంటికి రావాల్సిందిగా ప్రియురాలిని ఆహ్వానించిన యువకుడు తలుపులు తీయకుండా నిద్రపోయాడు. దీంతో చాలాసేపు అక్కడే నిలబడ్డ యువతి, చివరికి సహనం కోల్పోయింది.  పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై పోసి నిప్పంటించింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని వుడ్ బరీలో ఓ యువకుడు, తైజా రస్సెల్(29) అనే యువతికి పరిచయముంది. ఈ క్రమంలో ఇంటికి రావాలనీ, ఇద్దరం ఎంజాయ్ చేద్దామని సోమవారం అర్ధరాత్రి దాటాక యువకుడు రస్సెల్ కు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఆశగా ఇంటికి చేరుకుంది.


కానీ అప్పటికే పూటుగా మద్యం సేవించిన యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. రెండు సార్లు సందేశాలు పంపింది. అయినా యువకుడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లింది. ఓ బాటిల్ నిండా పెట్రోల్ తో పాటు అగ్గిపెట్టె, లైటర్ ను కొనుగోలు చేసింది. అనంతరం యువకుడి ఇంటిపై చల్లి, నిప్పు పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైంది.




అయితే మంటల వేడికి ఉదయం 4.30 గంటల సమయంలో మేలుకున్న యువకుడు కిటికీని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా అతనికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో యువకుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని శునకాన్ని కాపాడారు. మరోవైపు యువతి రస్సెల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM