by సూర్య | Tue, Aug 20, 2019, 04:14 PM
ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆర్ఐ సుబ్బారావు డిమాండ్ చేశాడు. చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగుతోంది.
Latest News