by సూర్య | Tue, Aug 20, 2019, 12:48 PM
విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండల పరిధి పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద 1000 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వ్యాన్ లో గంజాయిని తరలిస్తుండగా పి.కోనవలస చెక్ పోస్ట్ పోలీసులు వాహానాన్ని తనిఖీలు నిర్వహించగా 1000కిలోల గంజాయి బయటపడింది. డ్రైవర్ పారిపోగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు వాహానాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Latest News