by సూర్య | Mon, Jun 24, 2019, 12:44 PM
న్యూఢిల్లి : రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో లోక్సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేచి నిలబడి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. స్పీకర్ ఓంబిర్లా ఎన్ని పర్యాయాలు విన్నవించినా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గందరగోళం మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Latest News