by సూర్య | Sun, Jun 23, 2019, 12:52 PM
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో సీనియర్ మహిళా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ ఛందోలాఫై కాల్పులు జరిపిన ఘటన సంచలనంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపగా, కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ మిథాలీని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News