by సూర్య | Sun, Jun 23, 2019, 11:59 AM
రాష్ట్రంలో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. జులై నెల 3, 4 తేదీల నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ రమేష్కుమార్ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ, జడ్పీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జులై మూడో తేదీ లోగా ఓటర్ల జాబితాలను రూపొందించి ఆయా కార్యాలయాల వద్ద ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు.
ఇప్పటికే పంచాయతీ, నగర, పురపాలక సంఘాల ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసి, కులాల వారీగా ఓటర్లను గుర్తించి తుది జాబితాలను సైతం విడుదల చేశారు. దీంతో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు చేయాల్సి ఉంది.
Latest News