క్రీడ‌ల‌తోనే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు : ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌

by సూర్య | Sun, Jun 23, 2019, 12:10 PM

యువ‌త‌రం, వి ద్యార్ధుల‌ భవిష్యత్ ఉజ్వ‌ల‌మ‌వ్వాలంటే అది క్రీడలతోనే సాధ్య‌మవుతుంద‌ని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా ఒలింపిక్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఒలింపిక్ డే కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా   విచ్చేసిన  ఆయన మాట్లాడుతూ  క్రీడలతోనే  ఎవ‌రిలోనైనా శారీరక మానసిక ఉల్లాసం  క‌లుగుతుంద‌ని,  తమ పిల్లలను క్రీడలపై మక్కువ పెంచుకొనేలా ప్ర‌తి త‌ల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.  ఈ సంద‌ర్భంగా  అంబేడ్కర్‌ కూడలి వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి పాలకొండ రోడ్డు మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్టీఆర్‌ పురపాలక మైదానంలో భారీ బ‌హిరంగ స‌భ‌లో వ‌క్త‌లు మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి చంద్రరరావు, డీఈవో సాయిరాం, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.  


 


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM