by సూర్య | Sun, Jun 23, 2019, 12:10 PM
యువతరం, వి ద్యార్ధుల భవిష్యత్ ఉజ్వలమవ్వాలంటే అది క్రీడలతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ క్రీడలతోనే ఎవరిలోనైనా శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని, తమ పిల్లలను క్రీడలపై మక్కువ పెంచుకొనేలా ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కూడలి వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి పాలకొండ రోడ్డు మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ పురపాలక మైదానంలో భారీ బహిరంగ సభలో వక్తలు మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఒలింపిక్ సంఘం కార్యదర్శి చంద్రరరావు, డీఈవో సాయిరాం, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Latest News