by సూర్య | Sun, Jun 23, 2019, 11:51 AM
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను ఏపీ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని సీఎం వైఎస్ జగన్ను కోరతానని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది. మహాత్మా గాంధీ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్ హోటల్ వరకు రన్ ప్రారంభమైంది. మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్ రన్లో క్రీడాకారులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఒలింపిక్ అసోసియేషన్లో గత నాలుగేళ్లల్లో ఎన్నో రాజకీయాలు, వివాదాలు నడిచాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Latest News