by సూర్య | Sat, Jun 22, 2019, 02:18 PM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవిని స్వీకరించి తొలిసారిగా విశాఖ పార్టీకార్యాలయానికి వచ్చిన పుష్ప శ్రీవాణికి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖజిల్లా వైఎస్సార్సీపీ పార్లమెంటు జనరల్ సెక్రటరీ గండి జ్యోతి ఆమెను పుష్ఫగుచ్చెంతో ఘనంగా సత్కరించారు.
ఈసందర్భంగా ఆమె మీడియా మాట్లాడుతూ, రాజన్నరాజ్యంలో గిరిజనులకు సరైన న్యాయం చేస్తారనే పూర్తినమ్మకంతో సీఎం పుష్ఫవాణికి ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవిని ఇచ్చి విశేష స్థానం ఇవ్వడం మహిళా లోకానికే ఆదర్శమన్నారు. అంతేకాకుండా అతిచిన్న వయస్సులో మంత్రిపదవిని దక్కించుకున్న గిరిజన మహిళగా కూడా పుష్పశ్రీవాణి చరిత్ర స్రుష్టించారని కొనియాడారు. వైఎస్సార్సీపీలో మహిళలకు పెద్దపీట వేసిన విషయంలో మహిళానాయకులంతా సీఎం జగనన్నకు రుణపడి ఉంటారని అన్నారు. మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సీఎం జగనన్న పునికి పుచ్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు గండి జ్యోతి. గిరిజన సంక్షేమ మంత్రిగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అదేవిధంగా గిరజనులకు మంచి సేవలు అందించాలనే మంత్రిని కోరారు.
Latest News