by సూర్య | Sat, Jun 22, 2019, 02:24 PM
ఆనందపురం మండలాన్ని అన్ని రంగాల లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. తనకు ఈ మండలం నుంచి అధిక మెజారిటీ ఇచ్చి బాధ్యతను మరింత పెంచారన్నారు. భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఆనందపురం అభివృద్ధిని మరచిపోలేదన్నారు. తన చొరవతోనే జాతీయ రహదారి ఆరు లైన్లుగా అభివృద్ధి చెందుతుందని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయడమేతన కర్తవ్యంగా భావిస్తానని, అన్నారు. ఉన్నత పాఠశాలలలోప్రారంభించిన జూనియర్ కళాశాలకు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రాబోయే ఐఐఎం ఆనందపురం ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Latest News