పురుగుల మందు తాగి .ప్రేమ జంట ఆత్మహత్య

by సూర్య | Sat, Jun 22, 2019, 02:13 PM

గురవాయి గూడెంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జి లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన  జంగారెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకుంది. శనివారం వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్‌ (20), పోలవరం మండలం సరిపల్లిపుంత గ్రామానికి చెందిన బెల్లం పోచమ్మ (18) లు గ‌త కొంత‌కాలంగా  ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం తెలిసిన‌ పెద్దలు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో.. త‌మ ఇంటి నుంచి పారిపోయి బైట‌కు వ‌చ్చినా, పెద్ద‌లు త‌మ‌ని బ‌త‌క‌నివ్వ‌ర‌న్న భ‌యంతో  గురవాయి గూడెంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జి లో గది తీసుకున్నఈ ప్రేమ జంట తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిని గుర్తించిన లాడ్జి యజమాని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శేఖర్‌ చనిపోగా, యువతి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని,  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM