by సూర్య | Sat, Jun 22, 2019, 10:30 AM
తిరుమల తిరుపతి దేవస్థానం పాలశకమండలి సభ్యురాలిగా నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సతీమణి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి టీమ్లో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చురుకుగా పనిచేస్తున్నారు. నిన్నటి ఎన్నికల్లోనూ ఆయన తనదైన పాత్రను పోషించారు. ఇక ఈ దంపతులకు శ్రీవారు అంటే అమిత భక్తి. నెల్లూరు ఏ.సి స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలను వైభవంగా నిర్వహించి జిల్లా ప్రజలందరికీ ఆ ఉత్సవాలను తిలకించే అవకాశం కల్పించిన ఘనత ఈ దంపతులదే! అంతేగాక టిటిడిలో అన్నదానానికి, రూఫ్కు, ఇతర సేవా కార్యక్రమాలకు భూరి విరాళాలిచ్చి వున్నారు. స్వామివారి పట్ల వారికున్న భక్తివిశ్వాసాలకు ప్రతిఫలంగానే ప్రశాంతిరెడ్డి శ్రీవారి సేవలో తరించబోతుంది.
Latest News