by సూర్య | Sat, Jun 22, 2019, 09:37 AM
గత 5 సంవత్సరాలుగా పాలకమండలి తీసుకున్న వివాదస్పదమైన నిర్ణయాలు పై సమిక్షిస్తానని, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఉదయం కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన మార్గ మధ్యంలో తనని కలసిన మీడియాలో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని ఈ అదృష్టం కల్పించిన ఆంధ్రప్రదేశ్ సియం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అన్నారు. హిందు మతం, ధర్మాలు, వారసత్వంగా వస్తున్న సంప్రదాయం కాపాడుతూ భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ఇప్పటికే తనకు సియం ఆదేశించారని, తన ప్రయత్నం తాను ఖచ్చితంగా చేస్తానని అన్నారాయన. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని తదుపరి బంగారం వివాదాని నిగ్గు తేల్చుతాం, ప్రధాన అర్చకులు తోలగింపు నిర్ణయాన్ని పున:సమిక్షిస్తాం, టిటిడి ఉద్యోగులు సమస్యలను పరిష్కరిస్తాం అంటూ చెప్పుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి.
Latest News