by సూర్య | Fri, Jun 21, 2019, 05:17 PM
నలుగురు ఎంపీలు పార్టీ మారినంత మాత్రాన తెదేపాకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… భాజపాలో చేరిన నలుగురు ఎంపీలూ ఎన్నికల్లో పోటీచేసే ధైర్యంలేని వ్యక్తులని, వారికి రాష్ట్ర ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎన్నో సంక్షోభాలను చూసిన తెదేపాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పెద్ద సమస్యేమీ కాదన్నారు. తనకు తెలిసి ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారడంలేదని చెప్పారు. పార్టీలో తాజా పరిణామాలపై గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడుతూ.. తెదేపా నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులుగా తయారవుతారని వ్యాఖ్యానించారు. సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్కి ప్రజాదరణ లేకపోయినా పార్టీకి అంకితభావంతో ఉన్నారనే పదవులు ఇచ్చినట్లు స్పష్టంచేశారు.
Latest News