by సూర్య | Fri, Jun 21, 2019, 06:44 PM
టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉన్న ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖను పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు.
Latest News