by సూర్య | Fri, Jun 21, 2019, 05:05 PM
చంద్రబాబు అనుమతితోనే నలుగురు ఎంపీలు బీజేపీలో చేరానని ఏపీ మంత్రి శంకర నారాయణ అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా, సిఎం రమేష్ లు చంద్రబాబు బినామీలన్నారు. చంద్రబాబు అనుమతితోనే వారంతా బీజేపీలో చేరారన్నారు. 2024 ఎన్నికలు ఎదుర్కోవడానికి చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలని ఆయన విమర్శించారు. కుంభకోణాలలో ఉన్నవారంతా బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో రామన్న రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా జగనన్న నినాదం…. సాధించి తీరుతామని మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు.
Latest News