ఓబీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి: విజ‌యసాయి రెడ్డి

by సూర్య | Fri, Jun 21, 2019, 04:55 PM

హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో ఓబీసీల‌కు 50 శాతం రిజ‌ర్వే ష‌న్ క‌ల్పించాల‌ని ఇవాళ వైఎస్ఆర్‌సీపి డిమాండ్ చేసింది. రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ నేత విజ‌యసాయి రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టారు. ఆర్టికిల్ 330ఏ, 332ఏ స‌వ‌ర‌ణ కోరుతూ బిల్లును పెట్టారు. జ‌నాభాకు త‌గ్గ‌ట్టుగా పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 50 శాతం ఓబీసీల‌కు క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల‌కు ప్ర‌త్యేక మంత్రిత్వ‌శాఖ ఉన్న విధంగానే ఓబీసీల‌కు కూడా ప్ర‌త్యేక మంత్రిత్వ‌శాఖను ఏర్పాటు చేయాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ త‌ర‌హాలో ఓబీసీల‌కు ఓ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌న్నారు. రిజ‌ర్వేష‌న్ల అంశంలో త‌మిళ‌నాడును ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు అన్నారు. త‌మిళ‌నాడు ఓ రాష్ట్రం కాదు, అది ఓ ఉద్య‌మం అని ఆయ‌న అన్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM
అంబటికి అల్లుడికి షాక్.. మా మామ నీచుడంటూ వీడియో.. అసలు నిజమిదేనంటున్న వైసీపీ Sun, May 05, 2024, 07:33 PM
పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు Sun, May 05, 2024, 07:27 PM