24న జిల్లా కలెక్టర్లతో సిఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక సమావేశం

by సూర్య | Fri, Jun 21, 2019, 04:51 PM

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఈ నెల 24వ తేదీన మొట్టమొదటి జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. పాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యం, ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ, స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగంగా పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, వ్యవసాయం, కరవు, తాగునీరు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.  24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు.  

Latest News

 
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM
వైఎస్ జగన్ కాన్వాయి కిందపడిన కుక్క.. పోలీసులకు సీఎం సెక్యూరిటీ కీలక ఆదేశాలు Sun, Apr 28, 2024, 07:59 PM
విశాఖ పోర్టులో "ది వరల్డ్".. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ నౌక విశేషాలు తెలుసా Sun, Apr 28, 2024, 07:56 PM
బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:43 PM
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM