by సూర్య | Fri, Jun 21, 2019, 03:53 PM
రెండు ఆటోల్లో సుమారు 120 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులో భైరవకొండ వద్ద అధికారులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు.. 6 బస్తాలలో గంజాయి ప్యాకెట్లను ఆటోల సౌండ్ బాక్స్ లలో పెట్టి చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తుండగా.. ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు పరారైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ ఐసిఐఎన్ వెంకట్రావు విలేకరులకు వివరించారు.
Latest News