120 కిలోల గంజాయి పట్టివేత

by సూర్య | Fri, Jun 21, 2019, 03:53 PM

రెండు ఆటోల్లో సుమారు 120 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులో భైరవకొండ వద్ద అధికారులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు.. 6 బస్తాలలో గంజాయి ప్యాకెట్లను ఆటోల సౌండ్‌ బాక్స్‌ లలో పెట్టి చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తుండగా.. ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు పరారైనట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్‌ ఐసిఐఎన్‌ వెంకట్రావు విలేకరులకు వివరించారు.

Latest News

 
కనిగిరి అభివృద్ధిపై వుసేలేని సీఎం ప్రసంగం Sat, May 04, 2024, 02:37 PM
పోస్టల్ బ్యాలెట్ టీమ్లకు శిక్షణ Sat, May 04, 2024, 02:33 PM
పామూరులో టీడీపీలో చేరిన నాయకులు Sat, May 04, 2024, 02:32 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా Sat, May 04, 2024, 02:29 PM
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు: మాజీ ఎమ్మెల్యే Sat, May 04, 2024, 02:26 PM