by సూర్య | Fri, Jun 21, 2019, 03:21 PM
రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామన్నారు మంత్రి కొడాలి నాని. సచివాలయంలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాధరాజు పాల్గొనగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్చ జరిగింది. రేషన్ షాపుల ద్వారా కల్తీలేని సన్నబియ్యాని సరఫరా చేస్తామని, రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తెస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీతో ప్రభుత్వంపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని, అయినా సంక్షేమ ప్రభుత్వమే మా ధ్యేయమన్నారు.
Latest News