120 కిలోల గంజాయి పట్టివేత

by సూర్య | Fri, Jun 21, 2019, 03:53 PM

రెండు ఆటోల్లో సుమారు 120 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులో భైరవకొండ వద్ద అధికారులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు.. 6 బస్తాలలో గంజాయి ప్యాకెట్లను ఆటోల సౌండ్‌ బాక్స్‌ లలో పెట్టి చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తుండగా.. ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు పరారైనట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్‌ ఐసిఐఎన్‌ వెంకట్రావు విలేకరులకు వివరించారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM