by సూర్య | Fri, Jun 21, 2019, 01:52 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాఖ్ బిల్లు వివక్షతో కూడి ఉందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్సభలో నేడు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ త్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ బిల్లు పూర్తిగా వివక్షతో కూడి ఉందని ఒవైసీ అన్నారు. ఒకే రకమైన నేరం చేస్తే ముస్లిమేతరులకు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తే, ముస్లింలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళలపై ప్రేమ చూపించండి కానీ, శబరిమల వెళ్లాలనుకునే కేరళలోని మహిళల పట్ల కాదని ఆయన అన్నారు.
Latest News