by సూర్య | Fri, Jun 21, 2019, 01:55 PM
బీజేపీలో చేరి తన మీద ఉన్న కేసులను తెలుగుదేశం పార్టీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, సిఎం రమేష్లు ఎత్తి వేయించుకున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ నేత మురళీధరరావు టీడీపీ ఎంపీలో బీజేపీలో చేరికపై వస్తున్న విమర్శలపై ఆయన శుక్రవారం మీడియా కు సమాధానం ఇచ్చారు. ఏపిలో భారతీయ జనతా పార్టీని క్షేత్ర స్ధాయి నుంచి బలోపేతం చేసుకునే క్రమంలోనే టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నామని, ఇది తప్పెలా అవుతుందని నిలదీసారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ ఎంపీలు తమ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని రాజ్యాంగంలోని నిబంధనల మేరకు నిర్ణయం తీసుకున్నారని ఇది అనైతికం అని ప్రచారం చేయటం సరికాదన్నారు. టిడిపి నుంచి బిజెపిలోకి వచ్చినంత మాత్రాన ఆయా ఎంపీలపై ఇప్పటి వరకు ఉన్న ఐటీ, ఈడీ కేసుల నుంచి తప్పించుకోలేరని, కేసులు, రాజకీయాలనే వేర్వేరుగా చూడాలని అన్నారు మురళీధర్.
Latest News