by సూర్య | Fri, Jun 21, 2019, 01:19 PM
ఆరోగ్యకరమైన జీవితాల కోసం నాలుగు 'పి మంత్రాలు ఉపదేశించారు ప్రధాని మోడీ - పానీ (తాగునీరు), పోషన్ (పోషణ), పర్యావరన్ (పర్యావరణం) మరియు పారిశ్రామ్ (హార్డ్ వర్క్) లద్వారా జీవితాలలో పెనుమార్పులు తీసుకు రావచ్చని అన్నారు. శుక్రవారం రాంచీలొ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి ప్రభాత్ తారా మైదానంలో సుమారు 30,000 మందితో పాటు మోడీ యోగా చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజలకు, గిరిజన ప్రాంతాలకు యోగా చేరలేదని, యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకునేలా ప్రజలు తమ దైనందిత జీవితాన్ని మార్చుకోవాలని పిలుపు ఇచ్చారు, పేద ప్రజలు వ్యాధుల బారిన పడుతుండటం అది వారిని మరింత పేదలుగా చేస్తోందని, సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి యోగా ఒక మాధ్యమం అని, ఆరోగ్యం ఉంటే పేదరికం నుండి బయటకు వచ్చేందుకు అన్ని అనుకూలంగా మారుతాయని అన్నారు. అన్నారు. "శాంతి, సామరస్యం , పురోగతి కోసం యోగాష నినాదం కావాలన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుందని, అయితే ప్రజల ఆరోగ్యం యోగాతో ముడిపడి ఉందని తెలుసుకోవాలన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు కూడా యోగాను స్వీకరించి, అను నిత్యం చేయటం ద్వారా దానిని నివారించుకోవచ్చని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా అనేక అనారోగ్యాలు వెంటాడుతుంటాయి, వాటి నివారణ చర్యలు తీసుకోవటం ద్వరా మన ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సన అవనం ఉందని, ఇందుకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అందించే యోగాని అలవరచుకోవాలని అన్నారు. వయస్సు, ధనిక, పేద, కులం, మతం, ప్రాంతం సరిహద్దులు ఇవేవి లేని అధ్యయనం యోగా అని చెప్పారు. యోగా పురాతనమైనదే కాదు కాలానుగుణ మార్పులతో ఆధునికమైనది. స్థిరమైనది అభివృద్ధి చెందుతున్నది. ఏకత్వం. యోగా ప్రతి వ్యక్తి ఆలోచనలను మెరుగుపరుస్తుంది "అని మోడీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి రామ్చంద్ర కేసరితో పాటు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు
Latest News