by సూర్య | Fri, Jun 21, 2019, 01:46 PM
చట్టాలు చేయడానికే ప్రజలు తమను ఎన్నుకున్నారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. లోక్సభలో నేడు త్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టడానికి రవిశంకర్ ప్రసాద్ స్పీకర్ అనుమతి కోరారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ చట్టాలను చేయడానికే తమను ఎన్నుకున్నారని చెప్పారు. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, మహిళలకు న్యాయం చేయడం కోసమని ఆయన చెప్పారు.
Latest News