యోగా డేకి నితీష్ డుమ్మా

by సూర్య | Fri, Jun 21, 2019, 12:33 PM

దేశంలో అంగ‌రంగ వైభ‌వంగా  అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వ‌హించాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధులంతా హాజ‌రు కావాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపు అందుకుని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు యోగాడేలో పాల్గొన్నారు. అయితే బిజెపి మిత్ర ప‌క్ష‌మైన జెడి-యు అధినేత   బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం  జ‌రిగిన‌ అంతర్జాతీయ యోగా    కార్యక్రమాలకు దూరంగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. త‌మ పార్టీ  అధ్యక్షుడు ప్రతి ఉదయం యోగాను అభ్యసిస్తారని, దానిని అంద‌రూ ఆచ‌రించి ఆరోగ్యం పొందాల‌ని చెపుతుంటార‌ని,  అయితే భార‌త దేశ వార‌స‌త్వ సంప‌ద‌గా ఉన్న యోగాని కూడా  రాజకీయ ప్ర‌యోజ‌నాల‌కోసం వాడుకోవ‌టం వ‌ల్లే   "యోగా దినోత్సవ వేడుకలకు నితీష్ కుమార్ హాజరు కావడం లేదని జెడియు వ‌ర్గాలు చెప్పాయి. అయితే  రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇతర కార్యక్రమాలలో  డిప్యూటీ సుశీల్ కుమార్ మోడీ మరియు ఇతర క్యాబినెట్ మంత్రులు పాల్గొన‌టం విశేషం. 


 


 

Latest News

 
జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు ఉండవు Sat, May 04, 2024, 05:47 PM
మా భూమి మాది కాకపోతే మరెవరిది? Sat, May 04, 2024, 05:47 PM
బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే Sat, May 04, 2024, 05:46 PM
రాజకీయ హత్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు Sat, May 04, 2024, 05:43 PM
దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే రాజ్యాంగం మార్చడం ఖాయం Sat, May 04, 2024, 05:43 PM